చేకూరి గౌతమరాజు

చేకూరి గౌతమరాజు
Facebook

Wednesday, July 28, 2010

పోలవరానికి అనుమతులు

Polavaram9
పోలవరం ప్రాజెక్టుకు ఎట్టకేలకు కేంద్రం అనుమతి లభించింది.దీనికి ఎలాంటి షరతులూ లేకపోవడం విశేషం. గతంలో ఈ ప్రాజెక్టు కారణంగా పర్యా వరణానికి నష్టం కలుగుతుందని, దీని ద్వారా గిరిజనులు తమకు లభించే అటవీ లాభాన్ని కోల్పోతాయని విపక్షాలు వ్యతిరేకించాయి. దీంతో కేంద్రం ఈ అనుమతుల విషయంలో ఆచితూచి వ్యవహరిం చింది. పోలవరం వద్ద 301 శతకోటి ఘనపుటడుగుల నీటిని నిలువచేసే సామర్ధ్యంతో గోదావరిపై నిర్మించాలనుకుంటున్న పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర పర్యావరణ, అటవీశాఖలు ఇప్పుడు పచ్చజెండా ఊపాయి.

గోదావరి నదీ జలాల ద్వారా ముంపునకు గురయ్యే అటవీ ప్రాంతం ఎంత అన్న దానిపై నివేదిక, డిజైన్లు, కాంటూర్లు పరిశీలించిన పర్యావరణ విభాగం ఎట్టకేలకు ప్రాజెక్టు నిర్మాణానికి అన్ని అనుమతులు ఇచ్చింది. ఈ ప్రాజెక్టు ప్రాంతంలో నీటిని నిలువ చేయడం వల్ల జంతు జాలానికి కానీ, పర్యావరణ పరంగా ఇతరత్రా ఏ ఇబ్బందులూఉండవని స్పష్టం చేసింది. దీంతో ‘పోలవరం’ నిర్మాణానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయినట్లైంది.

ఈ ప్రాజెక్టు కింద ముంపునకు గురయ్యే 3 వేల ఏడు వందల హెక్టార్ల విస్తీర్ణంలో 258 హెక్టార్లను అటవీ ప్రాంతంగా గతంలో గుర్తించారు. దీనితో పర్యావరణ అనుమతులకై రాష్ట్ర ప్రభుత్వం తమ ప్రతిపా దనను పర్యావరణ మంత్రిత్వ శాఖ నియమించిన అటవీశాఖ సలహాదారుల సంఘం కొన్ని షరతులతో కూడిన అనుమతులు 2008 లో మొదటి దశకు ఇచ్చింది. పర్యావరణ శాఖ విధించిన అన్ని పరిమితులను పూర్తి చేసి రాష్ర్ట ప్రభుత్వం తన తుది నివేదికను గతేడాది సెప్టెంబరు మాసంలో పర్యావరణ శాఖకు అందజేసింది. ఈ నివేదికతో సంతృప్తి చెందిన పర్యావరణ శాఖ పోలవరం ప్రాజెక్టుకు పూర్తి అనుమతిని ఇచ్చింది.

సవరించిన అంచనాల ప్రకారం...
సవరించిన అంచనాల ప్రకారం రూ.10,286 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు నిర్మాణంలో 30శాతం మేరకు పనులు పూర్తయ్యాయి. 2012-13 నాటికి ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. 7.21 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటితో పాటు 960 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేయడం, కృష్ణానది పరీవాహక ఆయకట్టుకు 80 టీఎంసీల గోదావరి నీటిని అందించడం, విశాఖ పట్టణం పారిశ్రామిక, తాగునీటి అవసరాలకు 23.44 టీఎంసీల నీటిని అందించడం పోలవరం ప్రాజెక్టు లక్ష్యాలుగా నిర్దేశించారు. ఇన్ని ప్రయోజనాలున్నాయి.

పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని రాష్ట్రం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. విపక్ష నేతలు ప్రత్యేకించి ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ ప్రాజెక్టుకోసం ఉద్యమాలు చేయడం తెలిసిందే. పోలవరానికి జాతీయ ప్రాజెక్టు హోదా లభిస్తే కేంద్రమే 90శాతం నిధులను సమకూరుస్తుంది. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ‘సత్వర సాగునీటి పథకం’ (ఎఐబీపీ) కింద ఇచ్చిన రూ.300 కోట్లు అందాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వ పరంగా పోలవరానికి పర్యావరణ, అటవీ అనుమతులు కూడా లభించడంతో జాతీయ ప్రాజెక్టు హోదా కల్పనకు మార్గం సుగమం అవుతుందని సాగునీటిశాఖ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

రైతాంగంలో పెల్లుబుకుతున్న ఆనందం
పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం అనుమతితో ఆరు జిల్లాల్లోని ఆయకట్టు రైతాంగంలో ఆనందం వెల్లివిరుస్తోంది.దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి బతికుండగానే పోలవరానికి అవసరమైన చాలావరకు అనుమతులను కేంద్రంపై తీవ్ర ఒత్తిడి తెచ్చి సాధించారు. ఆయన హఠాన్మరణం అనంతరం పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఇప్పటికే ప్రాజెక్టుకు సంబంధించిన వివిధ స్థాయిల్లో వేల కోట్ల రూపాయలతో పనులు పురోగతిలో ఉన్నాయి. ప్రధాన పంట కాల్వల పనులు కోసం, భూ సేకరణ పనులు కోసం సుమారు నాలుగు వేల కోట్ల రూపాయల మేర ఖర్చు జరిగినట్లుగా తెలుస్తోంది.

హీలింగ్ మొక్కలూ సుఖీభవ!

మొక్కలకూ భావాలుంటాయి. అవి మనలాగే ఆనందపడతాయి. బాధపడతాయి. ఏడుస్తాయి. నవ్వుతాయి.
ఇవి ఎవరో అన్న మాటలు కావు. జగదీష్ చంద్రబోస్ వంటి శాస్త్రవేత్తల పరిశోధనలలో నిగ్గు తేలిన నిజాలు.
అలాంటి పరిశోధనే మరొకటి మన హైదరాబాద్‌లో ఆచార్య రంగా విశ్వవిద్యాలయంలో ప్రారంభమయింది. దీని ఫలితాలు మనకు తెలిసిన శాస్త్ర విజ్ఞానంపైన, వ్యవసాయ పద్ధతుల మీద ప్రభావం చూపుతాయంటే అతిశయోక్తి కాదు.

"ఈ ప్రపంచమంతా శక్తిమయం. ఆ శక్తిని ఉపయోగించుకోవటం తెలిస్తే ప్రకృతి మీద మనం విజయం సాధించినట్లే'' అంటారు శాస్త్రవేత్తలు. మన భౌతిక అవసరాల కోసం నీరు, గాలి, భూమిలో ఉండే ఖనిజాలు- ఇలా అనేక మాధ్యమాలను ఉపయోగించుకుంటున్నాం. మనం శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండటానికి మన చుట్టూ ఉండే శక్తిని ఉపయోగించుకోవచ్చని కొందరు నమ్ముతారు. ఈ శక్తిని సేకరించి ఒక క్రమపద్ధతిలో అందించే ప్రక్రియకు 'ప్రాణిక్ హీలింగ్' అని పేరు.

'ఎన్.జి. రంగా'లో ప్రయోగాలు
మన చుట్టూ అపారమైన శక్తి నిక్షేపాలు ఉన్నాయని, వాటిని మన శరీరంలోకి ప్రవేశపెట్టగలిగితే అనేక రకాల ప్రయోజనాలు ఉంటాయని హీలింగ్‌ను నమ్మేవారు పేర్కొంటారు. ఈ శక్తికి వారు పెట్టిన పేరు 'ప్రాణ'. ఇవి మన చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. వీటిని శరీరంలోకి ప్రవేశపెట్టడం మొదలుపెడితే అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయని ప్రాణిక్ హీలర్స్ గట్టి నమ్మకం. ఈ శాస్త్రం చాలా కాలం నుంచి ప్రచారంలో ఉన్నా- ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రాణిక్ హీలింగ్ ఫౌండేషన్ మరో అడుగు ముందుకు వేసింది. కేవలం మానవుల్లోనే కాకుండా మొక్కలకు కూడా ఈ హీలింగ్ పనిచేస్తుందని నిరూపించాలని భావించింది.

"మేము ఆచార్య రంగా విశ్వవిద్యాలయంలో- మొక్కలపై ప్రాణిక్ హీలింగ్ ప్రభావాన్ని కనుగొనటానికి కొన్ని పరిశోధనలు చేశాం. టమోటా, కాప్సికం మొక్కలపై హీలింగ్ ఎటువంటి ప్రభావం చూపుతోందనే విషయాన్ని శాస్త్రీయంగా నమోదు చేశాం. దీనిలో ఆశ్చర్యకరమైన ఫలితాలు వెలువడ్డాయి. హీలింగ్ చేసిన మొక్కలకు, చేయని మొక్కలకు మధ్య చాలా తేడా కనిపించింది.

హీలింగ్ చేసిన మొక్కలు దిగుబడిలో మాత్రమే కాదు- అన్ని విధాలా ఆరోగ్యంగా ఉన్నాయి. అంతేకాకుండా ఈ మొక్కలకు ఎటువంటి ఎరువులు కూడా వేయాల్సిన అవసరం లేదు. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ పరిశోధనా ఫలితాలను విడుదల చేయలేకపోయాం. కేంద్ర ఆరోగ్య శాఖ ఈ పరిశోధనలను మరోసారి చేయమని కోరింది. వీటి కోసం ప్రభుత్వానికి 4.5 లక్షల రూపాయలు చెల్లించి, మళ్లీ ఆచార్య రంగా విశ్వవిద్యాలయంలో పరిశోధనలు ప్రారంభించాం'' అని ఫౌండేషన్ ఛైర్ పర్సన్ డాక్టర్ శారదాంబ వెల్లడించారు.

పరిశోధన ఎలా చేశారు?
1) ఈ పరిశోధన ఆచార్య రంగా విశ్వవిద్యాలయంలోని ఇద్దరు శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో జరిగింది. వీరికి కొందరు హీలర్స్ సహాయపడ్డారు. 2) టమోటా, కాప్సికంలపై ఈ పరిశోధనలు జరిగాయి.
3) ప్రతి పంటను రెండు ప్లాట్లలో వేశారు. ప్రతి ప్లాట్‌లోను 42 మొక్కలు నాటారు. ఒక ప్లాట్‌లో ఉన్న మొక్కలకు హీలింగ్ చేశారు. మరో ప్లాట్‌లో ఉన్న మొక్కలకు హీలింగ్ చేయలేదు.
4) హీలింగ్ చేసిన మొక్కల దిగుబడి 71 శాతం పెరిగింది. కేవలం దిగుబడి పెరగటం మాత్రమే కాదు, మొక్కల ఎత్తులోను.. టమోటా, కాప్సికంల సైజులో కూడా గణనీయమైన మార్పు కనిపించింది.
5) హీలింగ్ చేసిన మొక్కలకు ఎరువులు వేయకపోయినా ఎక్కువ దిగుబడి లభించింది. అదే విధంగా చీడపీడలు కూడా సోకలేదు.

మొక్కలలో సాధ్యమేనా?
మొక్కలకు మనుషుల మాదిరిగా హీలింగ్ చేయటం సాధ్యమేనా? అనే ప్రశ్నకు కూడా తమ వద్ద కచ్చితమైన సమాధానాలు ఉన్నాయని హీలర్స్ అంటారు. "ఏ ప్రాణికైనా శక్తి అవసరం. ఈ శక్తిని అందించటమే ప్రాణిక్ హీలింగ్ ప్రధాన లక్ష్యం. దీనికి మొక్కలు, మనుషులు అనే తేడా లేదు'' అని సీనియర్ హీలర్ భగవాన్ పేర్కొంటారు.

ప్రాణిక్ హీలింగ్ పద్ధతిలో జీవులకు శక్తిని అందించటానికి హీలర్స్‌కు కొంత సాధన అవసరం. సాధన చేసిన హీలర్స్ శక్తిని గ్రహించి అందరికి అందచేయగలుగుతారు. మన చుట్టూ ఉన్న శక్తిని గ్రహించి, దానిని అవసరమైన చోట అందించటానికి రెండు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. మొదటి పద్ధతిలో హీలర్ ఒక మీడియంగా(మధ్యవర్తిగా) మారి శక్తిని స్వీకరించి- మళ్లీ దానిని అవసరమైన చోట అందిస్తాడు. ఇక రెండో పద్ధతిలో శక్తిని స్ఫటికం వంటి స్వచ్ఛమైన పదార్థంలోకి సేకరించి- దానిని అవసరమైన వారికి అందిస్తారు. మొక్కలపై చేసిన ప్రయోగంలో ఇద్దరు సీనియర్ హీలర్స్ ప్రతి రోజు ఉదయం, సాయంత్రం మొక్కలకు తామే మీడియంగా మారి శక్తిని అందించేవారు.

అన్ని మొక్కలకు అందించటానికి దాదాపు రెండు నుంచి మూడు గంటల సమయం పట్టేది. ఒక వేళ వారు రాలేని రోజుల్లో - డిస్టెన్స్ హీలింగ్ (ఆలోచనలు ఎక్కడికి వెళితే అక్కడకు శక్తి ప్రసారం చేయవచ్చనేది ప్రాణిక్ హీలింగ్‌లో ఒక ప్రధానమైన భావన) ద్వారా శక్తిని అందచేసేవారు. ఇదంతా చదివిన తర్వాత మొక్కలకు ఆ శక్తి అందిందో లేదో ఎలా తెలుస్తుందనే ప్రశ్న తలెల్తే అవకాశముంది. దీనికి కూడా హీలర్స్ వద్ద సమాధానముంది. "సాధన చేయటం ద్వారా ఎవరికి ఎంత శక్తిని ఇవ్వాలనే విషయం తెలుస్తుంది. దీనికి కచ్చితమైన కొలతలు ఉండవు'' అని భగవాన్ వెల్లడిస్తున్నారు.

ప్రాణిక్ హీలింగ్ అంటే..
ఈ ప్రపంచమంతా శక్తిమయం. ఈ శక్తిని సేకరించి మంచి కోసం ఉపయోగించే ప్రక్రియనే ప్రాణిక్ హీలింగ్ అంటారు. దీని ద్వారా ప్రాణుల జీవనాన్ని మెరుగుపరచవచ్చని హీలర్స్ భావిస్తారు. ఈ పద్ధతి చాలా కాలం నుంచి అందుబాటులో ఉన్నా- దీనిని అంతర్జాతీయంగా వ్యాప్తిలోకి తీసుకువచ్చిన ఘనత మాత్రం ఫిలిప్పీన్స్‌కి చెందిన వాణిజ్యవేత్త గ్రాండ్ మాస్టర్ చౌ కాక్ సూకి చెందుతుంది. మన రాష్ట్రంలో ప్రాణిక్ హీలింగ్ ఫౌండేషన్ ఈ పద్ధతిని వ్యాప్తి చేయటానికి కృషి చేస్తోంది. అయితే ప్రాణిక్ హీలింగ్ ఎలా పనిచేస్తుందనే అంశంపై కచ్చితమైన ఆధారాలు ఏమీ లేవు. కొన్ని ఇతర పద్ధతుల మాదిరిగానే దీనిని కూడా నమ్మకంపై ఆధారపడిన ఒక పద్ధతిగా మాత్రమే గుర్తించాలి.

ఈ పద్ధతి శాస్త్రీయమేనా?
దీనికి శాస్త్రీయమైన ఆధారాలు లేవనేది విమర్శకుల ప్రధాన అభ్యంతరం. అయితే కళ్లముందు జరుగుతున్న విషయాన్ని పట్టించుకోకుండా ఆధారాల కోసం వెంపర్లాడటం తగదనేది ప్రాణిక్ హీలర్స్ వాదన. "నేను గత ఇరవై ఏళ్లుగా ప్రాణిక్ హీలింగ్‌ను సాధన చేస్తున్నా. నా కళ్ల ముందు కనిపించిన అనేక అద్భుతాలను నేను చూశాను. మొక్కలపై పరిశోధనను రంగా విశ్వవిద్యాలయంలో ఇద్దరు శాస్త్రవేత్తలు నిర్వహించారు. మా ఫౌండేషన్ నుంచి అనేక మంది హీలర్స్ ఈ అధ్యయనంలో పాల్గొన్నారు.

పరిశోధన చేసిన రెండు ప్లాట్లు పక్కపక్కనే ఉన్నాయి. వాటిలో ఉన్న మట్టి కూడా ఒకటేనని పరీక్షల్లో వెల్లడయింది. వాతావరణం కూడా ఒకటే. అటువంటప్పుడు కొన్ని మొక్కలు ఏపుగా ఎదిగి, మరికొన్ని ఎదగకపోవటం వెనకున్న కారణం ఏమిటి అనే విషయాన్ని మనం ఆలోచించాలి. దానికి ప్రాణిక్ హీలింగ్ ప్రధాన కారణమని మేం నమ్ముతున్నాం. ఒక్క హైదరాబాద్‌లో మాత్రమే కాదు. కోస్తా, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో అనేక చోట్ల రైతులు హీలింగ్‌ను సాధన చేసి ప్రయోజనాలు పొందుతున్నారు'' అంటారు సీనియర్ హీలర్ భగవాన్.

ఈ సృష్టిలో జరిగే ప్రతి పని వెనకున్న కారణాలను అన్వేషించే తత్వమే మానవుడిని ముందుకు నడిపిస్తోంది. ఈనాటికీ ప్రకృతిలో మనకు తెలియని అనేక విషయాలు ఉన్నాయి. తెలియని వాటిని విశ్వాసంగా (కొన్ని సందర్భాలలో మూఢ విశ్వాసాలుగా) తెలిసిన వాటిని శాస్త్రంగా మనం భావిస్తూ ఉంటాం. విశ్వాసమైనా, శాస్త్రమైనా- మానవ అభివృద్ధికి ఉపయోగపడితే అంతే చాలు. ఆ దిశగా మరో అడుగు ముందుకు వేయటానికి ఈ కొత్త పరిశోధన ఉపయోగపడాలని కోరుకుందాం.
-భావన

Tuesday, July 27, 2010

ఇందిరకు ప్రసంగించే అర్హత ఉందా?

మన దేశంలో జనాభా గణనకు ఆద్యుడు ఆశిష్‌బోస్. కేంద్రంలో అనేక అత్యున్నత స్థానాలను, పదవులను అధిష్ఠించిన బోస్- తన అనుభవాలను 'హెడ్‌కౌంట్- మెమరీస్ ఆఫ్ ఏ డెమోగ్రాఫర్' పేరిట పుస్తకంగా వెలువరించారు. పెంగ్విన్ సంస్థ ముద్రించిన ఈ పుస్తకంలోని కొన్ని ఆసక్తికరమైన అంశాలు మీ కోసం.

"మా మేనమామ అనీల్ కుమార్ చందా 1952లో కాంగ్రెస్ టిక్కెట్ మీద ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. ఆయనను నెహ్రూ ఉప విదేశాంగ మంత్రిగా నియమించారు. ఎన్నికల్లో గెలవక ముందు మామయ్య (చందా) రవీంద్రనాథ్ టాగూర్ దగ్గర పర్సనల్ సెక్రటరీగాను, శాంతి నికేతన్‌లోని ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్‌గాను వ్యవహరించేవారు.

మా మేనత్త రాణి చందా కూడా ప్రముఖ చిత్రకారిణి. మామయ్య ఢిల్లీకి మకాం మార్చిన తర్వాత నెహ్రూ కుటుంబంతో సన్నిహితంగా ఉండేవారు. అప్పుడు నేను మామయ్య బంగ్లాకు తరుచూ వెళ్తూ ఉండేవాడిని. ఆ సమయంలో నెహ్రూకు సంబంధించిన అనేక వ్యక్తిగత విషయాలు మామయ్య నాకు చెబుతూ ఉండేవారు..

ఒక రోజు రాత్రి భోజనం అయిన తర్వాత నెహ్రూకు బోర్ కొట్టింది. అనీల్ చందాను ఏవైనా సర్దార్‌జీ జోకులు ఉంటే చెప్పమని అడిగారు. నెహ్రూ అలా వెళ్లగా చూసి- చందా నాకు- 'ఏవైనా సర్దార్‌జీ జోకులు ఉంటే చెప్పు' అని ఫోన్ చేశారు.

"కారు పంపుతున్నా. వెంటనే నా దగ్గరకు వచ్చేయ్..'' అని పిలిచారు. నాకు కూడా సర్దార్‌జీ జోకులు తెలియవు. వెంటనే ఢిల్లీ యూనివర్సిటీలో ఉన్న మిగిలిన స్నేహితులందరిని సర్దార్‌జీ జోకులు చెప్పమని అడిగాను. కొన్నింటిని పోగు చేసి మామయ్యకు అందించాను. మామయ్య నెహ్రూ దగ్గరకు వెళ్లి ఆ జోకులు చెప్పారు. అందులో ఒక జోకుకు మాత్రం నెహ్రూ పడిపడి నవ్వారట.. ఆ జోక్ ఏమిటంటే- లేడీ మౌంట్‌బాటెన్, లార్డ్ మౌంట్‌బాటెన్‌లు వైస్రాయ్ బంగ్లాలో ఒకసారి పార్టీ ఇచ్చారు.

దానికి దేశంలో ఉన్న రాజకీయ నాయకులందరూ వచ్చారు. అందరూ తనివితీరా తాగుతున్నారు. కొందరు డ్యాన్స్ కూడా చేస్తున్నారు. పార్టీ సాగుతూనే ఉంది. అర్థరాత్రి అయిపోయింది. బయట పెద్దవాన పడుతోంది. అప్పటి రక్షణ మంత్రి బల్దేవ్ సింగ్ చాలా అన్యమనస్కంగా కనిపిస్తుంటే- మౌంట్‌బాటెన్ వచ్చి ఏమయిందని అడిగాడు. "పెద్ద వాన పడుతోంది.

నేను ఎలా వెడతాను? మధ్యలో కారు ఆగిపోతే ఏం చేయాలి?'' అన్నాడు బల్దేవ్ సింగ్. ఈ మాటలు విన్న లేడి మౌంట్‌బాటెన్- " మీరు ఆందోళనపడద్దు. ఈ భవంతిలో బోల్డు గదులు ఉన్నాయి. మీరు ఇక్కడే గెస్ట్‌రూమ్‌లో పడుకోవచ్చు..'' అని భరోసా ఇచ్చారు. కొద్దిసేపు తర్వాత చూస్తే బల్దేవ్ సింగ్ ఎక్కడా కనబడలేదు. కనీసం గుడ్‌నైట్ కూడా చెప్పకుండా బల్దేవ్ సింగ్ ఎక్కడికి వెళ్లిపోయాడా అని మౌంట్‌బాటెన్ దంపతులు ఆశ్చర్యపోయారు.

తర్వాత కొద్దిసేపటికి బల్దేవ్ సింగ్ హఠాత్తుగా మళ్లీ ప్రత్యక్షమయ్యాడు. "ఎక్కడికి వెళ్లారు?'' అని లేడి మౌంట్‌బాటెన్ బల్దేవ్ సింగ్‌ను అడిగారు. "మేడమ్.. మీరు నన్ను మీ గెస్ట్‌రూమ్‌లో పడుకోమన్నారు. అందుకే ఇంటికి వెళ్లి నా నైట్ డ్రెస్ తెచ్చుకుని వచ్చా'' అన్నాడు బల్దేవ్ సింగ్. (ఒకప్పుడు ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ కూడా ఢిల్లీ యూనివర్సిటీలో భాగంగా ఉండేది.

ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ స్టూడెంట్స్ యూనియన్ నేతగా ఆశిష్‌బోస్ ఉండేవారు. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో ఉన్న గ్వాయర్ హాల్‌లో మేధావులు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఉండేవారు. అయితే గ్వాయర్ హాల్ పురుషుల అధీనంలో ఉండేది. మహిళలకు ప్రవేశం ఉండేది కాదు. ఈ నేపథ్యంలో- విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించటానికి ఇందిరా గాంధీని ఆహ్వానించాలని నిర్ణయం తీసుకున్నారు.

ఆమెకు ఒక ఉత్తరం కూడా రాశారు. ఆ తర్వాత) ".. ఒక రోజు మధ్యాహ్నం భోజనం చేస్తున్న సమయంలో - చౌకీదార్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. "మీకు ప్రధానమంత్రి ఇంటి నుంచి ఫోన్ వచ్చింది..'' అని రొప్పుకుంటూ చెప్పాడు. నేను ఆశ్చర్యపోయా. ఎవరైనా ట్రిక్ ప్లే చేస్తున్నారేమో అనుకున్నా. "నేను బిజీగా ఉన్నానని చెప్పు..'' అని చౌకీదారును పంపేశా. వెళ్లిన వాడు వెళ్లినట్లే వెళ్లి మళ్లీ పరిగెత్తుకుంటూ వచ్చాడు.

"నిజంగానే ప్రధానమంత్రి ఇంటి నుంచి ఫోను వచ్చింది. మీ కోసం ఫోన్‌లో వెయిట్ చేస్తున్నారు..'' అన్నాడు. నేను కూడా వెంటనే పరిగెత్తుకుంటూ ఫోన్ దగ్గరకు వెళ్లా. ఫోన్ చేసింది ప్రధాని నెహ్రూ కాదు. ఆయన కూతురు ఇందిరా గాంధీ. "మిమ్మల్ని ఉద్దేశించి ప్రసంగించమన్నందుకు కృతజ్ఞతలు. కాని ఢిల్లీ యూనివర్సిటీ స్కాలర్స్‌ను ఉద్దేశించి నేను ఎలా ప్రసంగించగలను? కృష్ణ మీనన్ వంటి మేధావులు మాట్లాడిన చోట నేను మాట్లాడటం అంత సబబుగా ఉంటుందా? నా ప్రసంగానికి అందరూ ఒప్పుకోకపోవచ్చు కదా? '' అంటూ అనేక అనుమానాలు వ్యక్తం చేశారు.

"మీరు అలాంటి అనుమానాలు ఏమీ పెట్టుకోవద్దు. మీరు వస్తే చాలు. ఎక్కువ సేపు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు..'' అని నేను హామీ ఇచ్చేసాను. ఇందిరాగాంధీ వచ్చి ప్రసంగించటానికి ఒప్పుకున్నట్లు ఆ మర్నాడు వైస్‌ఛాన్సలర్‌కి తెలిసింది. ఆయన ఆందోళనపడటం మొదలుపెట్టాడు.

నన్ను ఆఫీసు రూమ్‌కి పిలిచాడు. "అసలు నువ్వు ఏం చేస్తున్నావో తెలుస్తోందా? రేపు నాకు తెలియకుండా ప్రధానిని కూడా యూనివర్సిటీకి పిలిచేసేట్లు ఉన్నావు? నేను రాకుండా ఆ ప్రోగ్రామ్ ఎలా జరుగుతుంది? నేను రాకపోతే ఇందిరాగాంధీ ఏమనుకుంటుంది? ఏదైనా సమస్య ఏర్పడితే ప్రధాన మంత్రి నన్ను తిడతారు'' అని నన్ను గట్టిగా మందలించాడు.

ఇదిలా ఉండగా విద్యార్థుల వైపు నుంచి కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. వైస్‌ఛాన్సలర్ మందలించిన మర్నాడు బ్రేక్‌ఫాస్ట్ చేస్తుండగా ఒక సహవిద్యార్థి నా దగ్గరకు వచ్చాడు. "గ్వాయర్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించే స్థాయిలో ఇందిరాగాంధీ ఉందా? అసలు ఆమె ఏం చదువుకుంది? ఇందిరకు మనను ఉద్దేశించి ప్రసంగించే అర్హత ఉందా? ప్రధానమంత్రి కుమార్తె కాబట్టి నువ్వు ఆమెను ప్రసంగించటానికి పిలిచావు'' అని గట్టిగా వాదించటం మొదలుపెట్టాడు.

"అవును. అందుకే పిలిచాను. అంతే కాదు. ఆమె అందంగా ఉంటుంది. తెలివైనది కూడా. అందుకోసం కూడా పిలిచాను..'' అని గట్టిగా సమాధానం చెప్పాను. ఇంతలో మరికొందరు విద్యార్థులు ఇందిరకు షేక్‌హ్యాండ్ ఇవ్వొచ్చా? అని అడగటం మొదలుపెట్టారు. "నమస్తే పెట్టండి చాలు. షేక్‌హ్యాండ్ ఇవ్వాల్సిన అవసరం లేదు'' అని వాళ్లకు నచ్చచెప్పాల్సి వచ్చింది.

"తర్వాత... ఇందిరాగాంధీ వచ్చింది. అనుకున్న సమయానికి సభ ప్రారంభమయింది. ఇందిరను ఆహ్వానిస్తూ నా ప్రసంగాన్ని ప్రారంభించా. ప్రసంగం చివర- "నాకు మిమ్మల్ని డిన్నర్‌కి కూడా ఆహ్వానించాలని ఉంది. కాని గ్వాయర్ హాల్‌లో ఒక చిత్రమైన సంప్రదాయం ఉంది. మహిళలను డైనింగ్ రూమ్‌లోకి అనుమతించరు. అందువల్ల మిమ్మల్ని డిన్నర్‌కు ఆహ్వానించలేకపోతున్నా..'' అన్నా. మా వైస్‌ఛాన్సలర్ మొహం పాలిపోయింది. ఆయన మైకు తీసుకున్నాడు.

"గ్వాయర్ హాల్‌లోకి మహిళలను అనుమతిస్తారు కాని ఈ హాల్‌ను నిర్మించిన సర్ మెరైస్ స్మృత్యర్థం.. ఆక్స్‌ఫర్డ్ సంపద్రాయాలను అనుసరించి- డైనింగ్ హాల్‌లోకి మాత్రం మహిళలకు ప్రవేశం లేదు. ఆ ఒక్క నిబంధనను మాత్రమే మేము పాటిస్తాము'' అన్నాడు. ఆ వెంటనే ఇందిరాగాంధీ ప్రసంగం ప్రారంభమయింది. గ్వాయర్ హాల్ సంప్రదాయాల గురించి కూడా ఆమె ప్రస్తావించారు. " మహిళలను చిన్నచూపు చూసే ఇలాంటి నిబంధనలను మనం తుంగలో తొక్కాలి..'' అని పిలుపునిచ్చారు. గ్వాయర్ హాలు డైనింగ్ రూమ్‌లోకి రాకుండానే వెళ్లిపోయారు.

ఆ తర్వాత కొద్ది కాలానికి గ్వాయర్ హాల్‌కు భారత్‌లో స్వీడిష్ అంబాసిడర్‌గా ఉన్న ఆల్వా మిర్దాల్‌ను (ఆమెకు 1982లో నోబెల్ శాంతి బహుమతి కూడా వచ్చింది) డిన్నర్‌కు ఆహ్వానించి- సంప్రదాయానికి తుదివీడ్కోలు ఇచ్చారు. ఆల్వా మిర్దాల్‌కు ఇలాంటి సంప్రదాయాన్ని బద్దలు కొట్టడం అది రెండో సారి. అంతకు ముందు అమెరికాలోని ప్రిన్‌స్టన్ విశ్వవిద్యాలయంలో ఉన్న ఈ తరహా నిబంధనను కూడా ఆమే బద్దలు కొట్టింది.

Sunday, July 25, 2010

మారండి మహాప్రభో...

చెట్టు కింద ఒక టేబుల్ ఉంది. దాని మీద 'ఇక్కడ అన్ని రకాల పిటిషన్లూ స్వీకరించబడును' అని బోర్డు ఉంది. టేబుల్ మీద మూడు రంగుల ట్రేలు ఉన్నాయి. ఒకదాన్లో ఆపండి, ఒకదాన్లో చేయండి, ఒకదాన్లో మార్చండి పిటిషన్లను వేయమన్న సూచన ఉంది.


చేయండి ట్రేలో ఉన్నవన్నీ మరీ పాతగా ఉన్నాయి. నలిగిపోయి కొన్ని చోట్ల అక్షరాలు కూడా సరిగ్గా కనిపించడం లేదు.
మార్చండి ట్రేలో వన్నీ టైపు చేసిన పిటిషన్లే కాని ఎక్కువ లేవు.
ఆపండి ట్రేలో మాత్రం కట్టలు కట్టలు ఉన్నాయి. కాగితాలతో పాటు సిడిలు, డివిడిలు ఉన్న కవర్లు కూడా ఉన్నాయి.
ముందు పాతవే చూద్దామని చేయండి ట్రేలోని కాగితాలు బయటకు తీశారు. మా ఊరికి కరెంటు, రోడ్డు, స్కూలు, మంచినీరు, సాగునీరు, రేషన్ వగైరా సౌకర్యాలు కలగచేయండి వంటి దరఖాస్తులు ఉన్నాయందులో.
మార్చండి ట్రేలో తర్వాతి దశ సమస్యలు కనిపించాయి. ఫలానా ఎస్.పి మరీ కర్కోటకంగా ఉన్నాడు కాబట్టి మా జిల్లా నుంచి మార్చేయండి అని (వేరే జిల్లా వాళ్లు ఏమైపోవాలనో) ఒక పిటిషన్. లేదా ఫలానా డాక్టర్, టీచర్, హెల్పర్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, విఎఒ, ఇంజనీర్, కాంట్రాక్టరు ఇలా ఎవరో ఒకర్ని బదిలీ చేయమన్న కోరికలే అవన్నీ. విద్యావిధానాన్ని మార్చండి, పోలవరం ప్రాజెక్టు డిజైన్ మార్చండి లాంటి డిమాండ్లూ కొన్ని లేకపోలేదు.

ఆపండి ట్రేలో ఉన్నవి మాత్రం అన్నీ కొత్తవే. అవినీతిని ఆపండి, భూసేకరణలను ఆపండి, ధరల పెరుగుదలను ఆపండి, సెజ్‌లను ఆపండి, బాబ్లీని ఆపండి, ఓదార్పు యాత్రను ఆపండి, థర్మల్ ప్రాజెక్టులను ఆపండి, వలసలను ఆపండి, విస్థాపనలను ఆపండి, మతకలహాలను ఆపండి, మలేరియాను ఆపండి, అక్రమ మైనింగ్‌లను ఆపండి, యాసిడ్ దాడులను ఆపండి, కాలుష్యాన్ని ఆపండి, ఆత్మహత్యలను ఆపండి, అంతరాలను ఆపండి... ఇలా అసంఖ్యాక పిటీషన్‌లు ఉన్నాయి అందులో.
బంట్రోతు మరో కొత్త ట్రే పట్టుకొచ్చాడు. దానికి ఇంకా ఏ పేరూ పెట్టలేదు. కానీ అది ఖాళీగా వుండిపోతుందని అతనికి ఎందుకో గట్టిగా అనిపించింది.

Sunday, July 18, 2010

పిడికెడు పిట్ట.. ప్రపంచ వింత

అదో పిడికెడంత పిట్ట. ప్రపంచ పక్షి శాస్త్ర పరిశోధక లోకమంతా దాని కోసమే ఆసక్తిగా ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తోంది. వేల రకాల పక్షులెన్నో ఉన్నాయి. వాటన్నింటినీ కాదని ఆ పక్షి కోసమే ఎందుకంత ఆసక్తి.. ప్రపంచ పక్షి లోకంలో దానికంత పేరెందుకు.. దాని ప్రత్యేకతలేమున్నాయి.. సాధారణ జనావళి నుంచి పుట్టుకొచ్చే ప్రశ్నలు ఇవి. ప్రపంచంలో వందల ఏళ్ల కిందట ఆనవాళ్లే లేకుండా అంతరించిపోయిందని భావించిన పక్షి ఆకస్మికంగా మళ్లీ కనిపిస్తే.. ఆ అనుభూతే వర్ణణాతీతం. ఆ అరుదైన పక్షి మన రాష్ట్రంలోని కడప జిల్లా అడవుల్లోని కలివిపొదల్లో కనిపించింది. అందుకే దీన్ని ఇక్కడి వారంతా కలివికోడిగా పిలుస్తుంటారు. ఇంతకీ దీని అసలు పేరుకు మళ్లీ ఓ కథ ఉంది.

birdజోహారు జోర్డాన్‌!!
బ్రిటీష్‌ సైన్యంలో వైద్యాధికారిగా పనిచేసిన డాక్టర్‌ టి.సి. జోర్డాన్‌ ఈవింత పక్షిని తొలిసారిగా గుర్తించారు. వేలాది పక్షి జాతుల్లో ఒకే నమూనా పోలి కనిపించే కొన్ని రకాల పక్షులను కొర్సర్స్‌గా పిలుస్తుంటారు. అలాంటి పక్షుల్లో ఒకటిగా ఉండి అంతరించిపోయినట్లు కొంత కాలం ప్రపంచాన్ని నమ్మించిన ఈ పక్షిని తొలిసారి 1848లో జోర్డాన్స్‌కు సెంట్రల్‌ ఇండియాలో కనిపించింది. 1900 దాకా ఈ పక్షిని ఆయనే అక్కడక్కడా అరుదుగా చూస్తూ వచ్చారు. ఇక ఆ తరువాత అది ఎంత వెదికినా కనిపించలేదు. 86 ఏళ్ల తరువాత ఇది తిరిగి కడప జిల్లా లంకమల అడవుల్లో ప్రత్యక్షమై పక్షి ప్రపంచాన్నే అబ్బురపరిచింది. భూ ప్రపంచంలో ఇక పూర్తిగా అంతరించిపోయిందనుకున్న ఈ పక్షి ఇంకా బతికే ఉందని లోకానికి చాటి చెప్పిన టిసి జోర్డాన్‌ జ్ఞాపకార్ధం ఈ పక్షికి జోర్డాన్‌ కొర్రర్స్‌గా పేరు పెట్టారు.

సహజ కంఠాభరణం కలివికోడి సొంతం...
bird-lgsవేల రకాల పక్షుల్లో తాను ఒకటిగా ఇంకా బతికే ఉన్నానంటూ ప్రత్యేకత చాటుకున్న కలివికోడికి అందం ఒక ఆకర్షణే. చూపరులకు చిన్న గువ్వే అయినా సహజ సిద్ధమైన కంఠాభరణంతో తనకే పక్షి సాటి అన్నట్లు ఠీవి ఒలకబోస్తుంటుంది. తల కింది భాగాన నారింజ రంగు మెరుపులు, తెల్లటి కనుబొమ్మలు, గోధుమ వర్ణంలో ఉన్న రెక్కలు, చిన్నపాటి కొప్పును పోలిన తోక, వంచిన కాళ్లపై వయ్యారంగా నిలబడే ఈ పక్షికి ఎద పైభాగాన ఉన్న నలుపు తెలుపుల సమ్మేళనమైన వర్ణంతో కంఠాభరణంలా అలంకరించినట్లుండే మెడపట్టి కలివికోడికే సొంతం. తీర్చిదిద్దినట్లుండే కనుసొగలతో ఠీవిగా నిలుచుకొనే ఈ పక్షి ఎత్తు తక్కువే అయినా బరువు పావు కిలో లోపే. లేలేత గోధుమ రంగుతో తలుకు బెలుకులు చూపుతూ కనిపించి కనిపించనట్లు రెప్పపాటులో అదృశ్యం అవుతుంటుంది.

చిట్టడవులు, కలివిపొదలు ఆవాసం...
అన్ని పక్షుల్లాగే హాయిగా గగన తలంలో విహరించే శక్తి ఉన్నా ఈ పక్షి ఆవాసం చిట్టడవులు, చిరుపొదలే. కలివిచెట్ల మాటునే ఇది కోడిలా గెంతుతూ కనిపిస్తుంటుంది. అందుకే దీన్ని కలివికోడిగా పిలుస్తుంటారు. ఒకప్పుడు మహావృక్షాలతో అలరారిన అడవులస్థానంలో క్షీణదశకు చేరి చిట్టడవులుగా మిగిలిన పొదలు, అందులోనూ కలివి పొదలు కలివికోడికి ఆవాస నివాసాలు. ఈ పొదలే తనకు సురక్షితమైన నివాసాలుగా ఈ పక్షులు భావిస్తాయి. పగలంతా ఈ కలివి పొదల్లోనే విశ్రాంతి తీసుకుంటూ చీకటిపడగానే మెల్లమెల్లగా పొదల నుంచి అడుగులో అడుగు వేస్తూ పరిసరాలను పరికించి చూస్తూ బైటకొస్తుంటాయి.

PIC_21చెదలే ఆహారం...
కలివి పొదల్లో తిరుగాడే ఈపక్షికి చెద పురుగులే ప్రధాన ఆహారం. చీమలు, ఉసుర్లు వంటి చిన్న చిన్న పురుగులను ఎన్నింటిని తిన్నా చెదలు కనిపిస్తే పరమాన్నం దొరికినంత సంబరపడిపోతుంటుంది. కలివిపొదల కొమ్మలు, రెమ్మలు నేలకు తాకుతూ ఉండడంతో వీటిని చెదలు ఎక్కువగా ఆశ్రయిస్తుంటాయి. పైన మట్టి పూత వేసి లోన ఎంత దాక్కున్నా అవి కలివికోడి దృష్టి నుంచి తప్పించుకోలేవు. రాత్రి మాత్రమే ఇది ఆహారం తీసుకొని పగలంతా విశ్రాంతిగా ఉంటుంది. కలివికోడి మల విసర్జనను(రెట్ట)ను గుర్తించి పలుమార్లు పరిశోధకులు చేసిన పరీక్షల్లో ఈ విషయం బైటపడింది. కలివికోడి ‘విసర్జన’లో చెదలకు సంబంధించిన పెంకుల్లాంటి జీర్ణం కాని నోటి భాగాలు (మాండిబుల్స్‌) కనిపించాయి. అయితే ఈపక్షి దాహం ఎలా తీర్చుకుంటుంది, ఒక్కసారి నీరు తాగితే ఎంత సమయం ఉండగలదు అన్న వివరాలు ఇంకా తెలుసుకోలేకపో తున్నారు.

కూహు... కూహు... స్వరాల రాగాలు...
కూహూ... కూహూ... స్వరాల రాగాలతో కలివికోడి పక్షి ప్రపంచంలో తన ప్రత్యేకతను మరో మారు చాటుకుంటోంది. వేల రకాల పక్షుల కూతల్లో లివికోడి కూత ఇట్టే పట్టేయవచ్చు. కోయిలను మించి పోయి అరగంటైనా నిరంతరంగా కూత పెట్టే ఈ పక్షి నవంబరు నుంచి మార్చి మధ్య ఎక్కువగా కూత పెడుతూ ఉంటుంది. శీతాకాలం చలి ప్రభావమో ఏమో కానీ ఈ సమయంలోనే గుడ్లు పెట్టి పొదిగే కాలం కావచ్చన్నది పరిశోధకుల అభిప్రాయం. అయితే ఇది ఎప్పుడు గుడ్లు పెడుతుంది, ఎక్కడ పెడుతుంది, ఎన్ని గుడ్లు పెడుతుంది అన్నది ఇంకా ‘శోధన’ దశలోనే ఉంది. మగ, ఆడ పక్షుల లింగబేధాలు, అవి జత కట్టేందుకు వాతావరణ అనుకూలత తదితర కోణాల్లో పరిశోధనలు పురోగమించాల్సి ఉంది. ఈ పక్షుల ఈకలు గుర్తిస్తూ రాల్చిన ఈకలను పరీక్ష చేస్తున్నారు.

11bకలివికోడి కనుగొన్న తీరు...
రెండు దశాబ్ధాల కిందటి ముచ్చట ఇది. 1986 జనవరి 5. చలికాలం. కడప జిల్లా అట్లూరు మండలం రెడ్డిపల్లె సమీపంలో లంకమల చిట్టడవులు అవి. రాత్రి 2గంటల సమయం. రెండు వింతైన పక్షులు వేటగాడి టార్చిలైట్‌ వెలుగులో తళుక్కున మెరిశాయి. పొడవాటి ర్రకు ఉచ్చు తగిలించిన వేటగాడు దగ్గరకుపోయి వాటి మెడకు ఉచ్చు తగిలించపోయాడు. ఓ పక్షి గిర్రున ఎగిరిపోయింది. అప్పటికే మంచులో తడిసి ముద్ద అయిన ఆ పక్షి ఎగిరేందుకు తడిసిన రెక్కలు సహకరించక, పరిగెత్తే శక్తి లేక వేటగాడి ఉచ్చుల గవాక్షం నుంచి జన ప్రపంచంలోకి తొంగి చూసింది. ఆనాటి వేటగాడు నేటి ఫారెస్ట్‌గార్డు. కలివికోడిని ఉచ్చులో పట్టి ఈ పక్షి ఇంకా బతికే ఉందని ప్రపంచానికి చాటిన ఆనాటి వేటగాడు ఐతన్నను అదే అడవికి ప్రభుత్వం నియమించిన ఫారెస్ట్‌గార్డ్‌.

పక్షిని పట్టిన తీరు ‘ఐతన్న’ మాటల్లోనే...
మాది రెడ్డిపల్లె. గొర్రెల కాసుకుంటూ అడవికి పోతుంటి. 20 ఏళ్ల కిందట భరత భూషణ్‌ అనే రేంజ్‌ ఆఫీసర్‌ ఈ ప్రాంతానికి వచ్చారు. నా దగ్గర ఒక ఫోటో చూపి ఇలాంటి పక్షిని చూశావా, చూస్తే కనిపిస్తే పట్టిస్తే రూ.1116లు బహుమానం, ఉద్యోగం ఇస్తా అని ప్రకటించారు. పక్షి గుర్తులు వివరించే ఫోటో ఇచ్చారు. ఇలాంటి పక్షులు చూశా అని గొర్లు, ఆవులు కాసేవారు అనుకుంటున్నారని చె ప్పాను. నేనే రాత్రి వేళల్లో 8 నెలలు తిరిగాను. నాకే 1986 జనవరి 5న కనిపించింది. ఉచ్చు వేసి పట్టి తువ్వాల్లో మూటగట్టి ఇంటికి తెచ్చాను. గంప కింద మూశా.

joorతెల్లారాక సిద్దవటం రేంజర్‌ మద్దిలేటికి విషయం చెప్పాను. ఆయన చూసి డి ఎఫ్‌ఓకు చెప్పారు. మరోమారు భరతభూషణ్‌ వచ్చి ఆ పక్షి ఇదేనని నిర్ధారించారు. ఢిల్లీకి టెలిగ్రామ్‌ కొట్టారు. గంప కింద ఉన్న పక్షికి సొద్దలు, కొర్రలు, రాగి గింజలు వేశా. తినలేదది. అలాగే ఉంది. వారం అయింది. పక్షి శాస్తవ్రేత్త సలీంఅలీతో పాటు ఉన్నతాధికారులు వచ్చారు. గంప కింద ముడుచుకుపోయిన పక్షిని చూశారు. పక్షి దొరికిన ప్రాంతం చూపించాను. తిరిగి ఇంటికొచ్చే సరికి పక్షి చనిపోయింది. పొట్ట చీల్చి, పేగులు తీసి పొడి నింపి పక్షిని తీసుకుపోయారు. నాకు నెలకు 500 ఇచ్చి పక్షిని చూపేందుకు వెంట తిప్పే పని చూపారు. 1990లో వాచర్‌గా ఉద్యోగం రెగ్యులర్‌ చేశారు. ఇంక ఆ పక్షి పుణ్యమా అని నెలకు 7500 జీతం తీసుకుంటున్నా. మా కుటుంబం అంతటికీ ఆధారం ఆ పక్షే.

తెలుగుగంగను నిలేసిన కలివికోడి...
పిడికెడు దాటని ఈ పిట్ట వేల కోట్లతో ప్రభుత్వం చేపట్టిన తెలుగుగంగ పథకాన్నే నిలేసింది. దీని దెబ్బకు భారీ ప్రొక్లెయిన్లే తొండముడిచాయి. గంగ కాలువ దారి మళ్లించుకోక తప్పని పరిస్థితులు తలెత్తాయి. తన ఆవాసంలో తిప్పిన కాల్వను మళ్లీ పూడ్చి వేసేదాకా వదలలేదు. అందుకు బాధ్యులైన వారిని కోర్టుకీడ్చి దోషులుగా నిలబెట్టింది. తెలుగుగంగ పథకం కింద శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి రిజర్వాయరు దిగువన తెలుగుగంగ కుడి ప్రధాన కాల్వ 30 కిమీ నుంచి 40 కిమీ వరకు కలివికోడి ఆవాసమైన అభయారణ్యంలో తవ్వకాలు జరిపేందుకు గంగ అధికారులు సిద్ధమయ్యారు.

ప్రొక్లైన్లతో 400 మీటర్ల కాలువ కూడా తవ్వారు. అయితే అభయారణ్యంలోకి అనుమతి లేకుండా అక్రమంగా ప్రవేశించి తవ్వకాలు జరిపినట్లు గుర్తించిన కడప అటవీశాఖాధికారులు 2005 నవంబరు 23న కేసు నమోదు చేశారు. ఐవి ఆర్‌సి ఎల్‌ కంపెనీకి చెందిన ప్రొక్లైన్‌, జీపు సీజ్‌ చేశారు. సెక్షన్‌ 27-1, 29 ఐపిసి 141,149,వైల్డ్‌లైఫ్‌ ప్రొటె క్షన్‌ యాక్టు 1972ల కింద గంగ పనులు చేస్తున్న ఐవి ఆర్‌సి ఎల్‌ కంపెనీ అధికారులు తొమ్మిది మందిపై కేసులు నమోదు చేసి కోర్టుకు అప్పగించారు. బాంబే నేచురల్‌ హిస్టరీ సొసైటీ కూడా దీనిపై తీవ్రంగా స్పందించింది.

aఅరుదైన కలివికోడి ఉనికినే ప్రశ్నార్ధకం చేస్తున్నారని ఆందోళన వెలిబుచ్చింది. 2006 మార్చిలో సుప్రీంకోర్టు సమస్య పరిష్కారం కోసం సాధికారిక కమిటిని వేసింది. ఈ కమిటిలో బి ఎన్‌హెచ్‌ ఎస్‌ డైరెక్టర్‌, ప్రభుత్వ కార్యదర్శి, నీటిపారుదల చీఫ్‌ ఇంజనీరులు సభ్యులుగా జాయింట్‌ మీటింగుల ద్వారా ఈ సమస్యకు పరిష్కారం లభించాల్సి ఉంది. అయితే ప్రభుత్వం ఇప్పటికే ప్రస్తుతం ఉన్న కాలువ తవ్వకం అలైన్‌మెంట్‌ను మార్చుకొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు నివేదిక సమర్పించింది. ఇదే జరిగితే బద్వేలు ప్రాంతంలో రెడ్డిపల్లె, వెంకటశెట్టిపల్లె, తిప్పనపల్లె తదితర గ్రామాలకు చెందిన 2వేల ఎకరాలకు గంగనీరు అందకుండా పోతుందని ఈ గ్రామాల రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇన్నాళ్లు ఏ పక్షినైతే సంరక్షించుకుంటూ వచ్చామో అదే పక్షి తమ నోటి కాడ కూడు లాగేస్తుందన్న ఆవేదన ఆ గ్రామస్తుల్లో గూడు కట్టుకుంది.

ఫలిస్తున్న పరిశోధనలు...
ప్రపంచ చిత్రపటం నుంచి కనుమరుగైందని భావించిన కలివికోడి కడప జిల్లా అడవుల్లో ప్రత్యక్షం కావడంతో దీనిపై మరిన్ని పరిశోధనలు జరిపేందుకు బాంబే నేచురల్‌ హిస్టరీ సొసైటీ రంగంలోకి దిగింది. రాష్ట్ర ప్రభుత్వం అనుమతితో జనవరి 2000 సంవత్సరం నుంచి ఇక్కడ బి ఎన్‌హెచ్‌ ఎస్‌ ప్రతినిధిగా జగన్నాధన్‌ పరిశోధనలు చేస్తున్నారు. పక్షిని ఎన్నోసార్లు చూసినా దాన్ని పట్టుకొనేందుకు అనుమతి లేకపోవడంతో పరిశోధనలు ఆశించిన రీతిలో ముందడుగు పడడంలేదు. అయితే ఇటీవలే ఈ పక్షిని పట్టుకొనేందుకు అనుమతి లభించింది.

రేడియో టెలిమీటర్‌ ప్రయోగం...
కలివికోడిని పట్టుకొని రేడియో టెలిమీటర్‌ ప్రయోగం చేస్తే ఈ పక్షి గుట్టుమట్టు బైట పడ్డట్టే అని పరిశోధకుల అభిప్రాయం. మూడు నెలల్లో దీని హోంరేంజ్‌ తెలిసిపోతుందంటున్నారు. ఈ పక్షి ఇతర పక్షులతో కలుస్తుందా, లేదా, సంతానోత్పత్తి, జీవితకాలం తదితర వివరాలు రేడియో టెలిమీటర్‌ ప్రయోగంతో కనిపెట్టవచ్చంటు న్నారు.

ఇప్పటి దాకా సాగిన పరిశోధనలు పరిశీలిస్తే.. తీతువుపిట్ట, పూరేలు, కంజులను పోలి ఉండే ఈ కలివికోడి కాళ్ల వేళ్లను కెమెరా ట్రాప్‌ల ద్వారా గుర్తించారు. తొలిసారి ఇండియాలో ఈ కెమెరాట్రాప్‌ను కలివికోడి కోసం కడప జిల్లాలో ఉపయోగిస్తున్నారు. ఇన్‌ఫ్రారెడ్‌ కట్‌ అయితే ఫ్లాష్‌ వెలిగే ఈ కెమెరాలను ఇక్కడ ఎనిమిదింటిని ఏర్పాటు చేశారు. కలివికోడి తిరుగాడే ఆవాసాలను గుర్తించి మెత్తటి ఇసుక మట్టిని పట్టిలుగా నేలపై పోసి కాలి వేళ్లను గమనిస్తున్నారు. ట్రాకింగ్‌ స్ట్రిప్‌లపై పడ్డ పాదం గుర్తులను ఒకే స్థలంలో నెలరోజులు పరిశీలన చేసి ట్రైల్‌ మాస్టర్‌ కెమెరాలు ఉపయోగిస్తున్నారు.

కూత రికార్డింగ్‌...
కలివికోడి కూతను టేప్‌రికార్డర్‌లలో రికార్డు చేయగలిగారు. ఈ కూతను చిన్న బాక్సుల్లో రీరికార్డు చేసి ప్రజలకు వినిపిస్తూ ఈ పక్షి ఆవాసం గుర్తించేందుకు ప్రకటనలు, బోర్డుల ద్వారా ప్రచారం చేస్తున్నారు.

ప్రజలే రక్షణ...
ప్రపంచంలోనే అరుదైన కలివికోడి సంరక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక రక్షణ చర్యలంటూ అందుకు సంబంధించిన నిధుల కేటాయింపులేవీ చేపట్టలేదు. 1986లో రెడ్డిపల్లె పరిసరాల్లో ఈ పక్షిని గుర్తించడం, పక్షి శాస్త్ర పితామహుడు సలీంఆలీ ఇక్కడికి రావడంతో ఈ పక్షి ప్రాముఖ్యతను గుర్తించి ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని లంకమల అభయారణ్యంగా ప్రకటించింది.

Friday, July 16, 2010

Pictures from Pak Occupied Kashmir - hidden from the world view !!!


Pictures from Pak-occupied-Kashmir  - Heaven on earth



Dudipatsar lake is still forbidden to tourists.

This extremely beautiful lake is located in Kaghan Valley  






This is Mingora, Swat Valley , PoK
 




This beautiful lake is Karumbar. it is located in the Hindukush mountains.






Ushu nad Utror valleys of Swat.






A Hidden Lake - Karumbar in PoK.






Another Beautiful meadow in PoK






The Beautiful Dudipatsar lake






View of Shangrila resorts & Lake  






This is Deosai - one of the highest pleatues in the world.





Deosai





another place - Lalazar








In the way back from Dudipatsar Lake  





This is Shogran, PoK.





View of the Bureth Lake in PoK

 Environmental Sustainability 


Population and Environment

రూపాయి - కొత్త సింబల్



Friday, July 9, 2010

Rice fields of Japan - Pretty amazing work of art!

(How do you step back and make those final touches?)


Stunning crop art has sprung up across rice fields in Japan.

But this is no alien creation - the designs have been cleverly planted.

Farmers creating the huge displays use no ink or dye. Instead,

different colours of rice plants have been precisely and strategically arranged and grown in the paddy fields.

As summer progresses and the plants shoot up, the detailed artwork begins to emerge.




A Sengoku warrior on horseback has been created from hundreds of thousands of rice plants,

the colours created by using different varieties, in Inakadate in Japan

The largest and finest work is grown in the Aomori village of Inakadate, 600 miles north of Toyko,

where the tradition began in 1993.

The village has now earned a reputation for its agricultural artistry and this year

the enormous pictures of Napoleon and a Sengoku-period warrior,

both on horseback, are visible in a pair of fields adjacent to the town hall.

More than 150,000 vistors come to Inakadate,

where just 8,700 people live, every summer to see the extraordinary murals.

Each year hundreds of volunteers and villagers

plant four different varieties of rice in late May across huge swathes of paddy fields.





Napolean on horseback can be seen from the skies,

created by precision planting and months of planning between villagers and farmers in Inkadate





Fictional warrior Naoe Kanetsugu and his wife Osen appear in fields in the town of Yonezawa, Japan

And over the past few years, other villages have joined in with the plant designs.

Another famous rice paddy art venue is in the town of Yonezawa in the Yamagata prefecture.

This year's design shows the fictional 16th-century samurai warrior Naoe Kanetsugu and his wife,

Osen, whose lives feature in television series Tenchijin.

Various artwork has popped up in other rice-farming areas of Japan this year,

including designs of deer dancers.



Smaller works of crop art can be seen in other rice-farming areas of Japan such as this image of Doraemon and deer dancers

The farmers create the murals by planting little purple and yellow-leafed kodaimai rice

along with their local green-leafed tsugaru roman variety to create the coloured patterns between planting and harvesting in September.

The murals in Inakadate cover 15,000 square metres of paddy fields.

From ground level, the designs are invisible, and viewers have to climb the mock castle tower of the village office to get a glimpse of the work.

Rice-paddy art was started there in 1993 as a local revitalization project, an idea that grew out of meetings of the village committee.





Closer to the image, the careful placement of thousands of rice plants in the paddy fields can be seen




The different varieties of rice plant grow alongside each other to create the masterpieces

In the first nine years, the village office workers and local farmers grew a simple design of Mount Iwaki every year.

But their ideas grew more complicated and attracted more attention.

In 2005 agreements between landowners allowed the creation of enormous rice paddy art.

A year later, organisers used computers to precisely plot planting of the four differently colored rice varieties that bring the images to life.