చేకూరి గౌతమరాజు

చేకూరి గౌతమరాజు
Facebook

Sunday, August 22, 2010

పుల్ల ఐసు - బొంబాయి మిఠాయి * పాప్‌కార్న్‌

Popsicle
చల్లగా, తియ్యగా, పుల్లగా రకరకాల రుచులలో ఉండే పుల్ల ఐసు అంటే ఎవరికి ఇష్టం ఉండదు? స్కూలుకు వెళ్ళేప్పుడో, వచ్చేటప్పుడో బండి వాడు అమ్ముతున్న ఐస్‌ను కొనుక్కోకుండా ఎవరు ఉంటారు? పాలైసు, ద్రాక్షా ఐసు, ఆరెంజ్‌ ఐసు, సేమ్యా ఐసు, డబుల్‌ ఐసు... అబ్బా ఎంత బాగుంటాయో. మరి ఈ పుల్ల ఐసు ఎలా వచ్చింది అనంటే అనుకోకుండా వచ్చిందని చెప్పాలి.

అమెరికాలో శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన ‘ఫ్రాంక్‌ ఎవర్సన్‌’ తన 11 ఏళ్ళ వయసులో 1905లో అనుకోకుండా దీనిని కనిపెట్టాడు. ఫ్రూట్‌ జ్యూస్‌ను డీప్‌ఫ్రిజ్‌లో పెట్టి మర్చిపోయిన ఎవర్సన్‌ మరుసటిరోజు ఉదయం దానిని తీసి చూస్తే గడ్డ కట్టి కనిపించింది. టేస్ట్‌ చూస్తే చాలా బాగుందనిపించింది. అప్పటి నుంచి అతడు ఫ్రూట్‌ జ్యూస్‌లో పుల్ల గుచ్చి, డీప్‌ ఫ్రీజర్‌లో పెట్టి పుల్ల ఐసు తయారుచేయడం మొదలెట్టాడు. దానికి ‘పాప్సికల్‌’ అనే పేరు పెట్టాడు. అలా అలా అది ఆ దేశం నుంచి అన్ని దేశాలకు చేరింది. అలాగే ఎగ్జిబిషన్‌లోనో, షాపింగ్‌ మాల్స్‌లోనో కనిపించే పింక్‌ కలర్‌ బొంబాయి మిఠాయి (కాటన్‌ కాండీ) ని 1897లో ‘విలియం మొరిసన్‌’, ‘జాన్‌ సి వార్టన్‌’ అనే అమెరికా వ్యక్తులు తయారు చేశారు. కలర్‌ చక్కెరను మిషన్‌ తిరగలిలో వేసి దూది పొరల్లాంటి బొంబాయి మిఠాయిని వాళ్ళు తయారు చేశారు.


పాప్‌కార్న్‌
Popcorn1 
బస్‌స్టేషన్లలో, సినిమా హాళ్లలో, రైల్వే స్టేషన్లలో, షాపింగ్‌ మాల్స్‌, ప్రధాన కూడళ్ళు ఒకటేమిటి..మనం ఎక్కడికి వెళ్ళినా ఎక్కువగా కనిపించే తినుబండారం పాప్‌కార్న్‌. ఇప్పుడు అసలే వర్షకా లం. సాయంత్రం పూట... వర్షం పడుతుంటే... వేడివేడిగా పాప్‌కార్న్‌ రుచి చూడాలని ఎవరికుండదు. అందరూ ఎంతో ఇష్టంగా తినే ఈ పాప్‌కార్న్‌ ఎలా పుట్టిందో తెలుసుకుందామా...

అందరికీ ఇష్టమైన మొక్కజొన్న పుట్టింది మెక్సికోలోనట. క్రీ.పూ. 2500లోనే అక్కడ నివసించిన కాచైజ్‌ ఇండియన్లు మొక్కజొన్నను పండించి ఆహారంగా తీసుకొనేవారని అం టారు. కొంతకాలం క్రితం పెరూ దేశంలో తూర్పు తీరంలో దాదాపు వెయ్యేళ్ళ క్రితం నాటి మొక్కజొన్న గింజలు దొరికాయి. అన్నేళ్ళ తరువాత కూడా అవి వేయించి తినే స్థాయిలో ఉండటం విశేషం. మెక్సికో నుంచి బ్రిటన్‌కు చేరిన మొక్కజొన్నకు పంచదార జోడించి బ్రేక్‌ఫాస్ట్‌ తినడాన్ని ఇంగ్లీషువారు మొదలుపెట్టా రు.18వ శతాబ్దం తరువాతనే ఇప్పుడు మనం తింటున్న పేలాలు లేదా పాప్‌కార్న్‌ వాడుకలోకి వచ్చా యి. గింజల నుంచి పాప్‌ కార్న్‌ ఎలా వస్తుందంటే ప్రతి మొక్కజొన్న గింజలోనూ చిన్న నీటి బిందువు ఉంటుంది. ఇది గింజలో ఉన్న మెత్తటి పిండిపదార్థంలో నిల్వ ఉంటుంది. మనం ఎప్పుడైతే గింజల్ని వేడి చేస్తామో అప్పుడు ఆ నీరు వ్యాకోచిస్తుంది. దాంతో పీడ నం పెరిగి గింజ టప్‌మని పేలి పొరలుగా విచ్చుకుంటుంది. పూర్వం ఈ ప్రక్రియ ను చూసి అమెరికన్‌ తెగలు చాలా భయపడేవి. గింజలో ఆత్మ ఉంటుందనీ దానిని వేడి చేస్తే బయటకు వచ్చి చిటపటమని గోల చేస్తుందని నమ్మేవారు.

No comments:

Post a Comment